Mohan Bhagwat Train | మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి.. ఇద్దరు అనుమానితుల అరెస్ట్

ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Mohan Bhagwat Train | ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్ ( Mohan Bhagwat )ప్రయాణిస్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. కాన్పూర్ నుంచి న్యూఢిల్లీ వెళ్తుండగా, ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

Mohan Bhagwat Train | ఏం జరిగిందంటే..

గురువారం ఉదయం 7:15 గంటల సమయంలో, రైలు దక్షిణ , రసూల్‌పూర్ పోలీస్ స్టేషన్ల సరిహద్దు ప్రాంతంలో వెళ్తుండగా ఎవరో రాయి విసిరారు. ఈ ఘటనలో ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ కిటికీ అద్దం పగిలిపోయింది. అయితే, అదృష్టవశాత్తూ ఆ సమయంలో రైలులో ఉన్న ప్రయాణికులకు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. రైలు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది.

mohan.1

Mohan Bhagwat Train | పోలీసుల దర్యాప్తు..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ ఆదిత్య లాంగ్ తెలిపారు. రైలులో మోహన్ భగవత్ ఉన్న విషయాన్ని డీఎస్పీ ధృవీకరించారు. ఈ ఘటనను ఎంతో తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Bheemgal Ganja Seizure | ఎక్సైజ్ దాడుల్లో గంజాయి పట్టివేత.. ముగ్గురు బైండోవర్!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *