అక్షరటుడే వెబ్డెస్క్: NEET Paper Leak | ఢిల్లీలో మంగళవారం ( జులై 21 ) ఉదయం జరిగిన ఎన్డీఏ (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘నీట్’ పరీక్షల అక్రమాలు , పేపర్ లీకేజీ వ్యవహారంపై ఈ సమావేశంలో ఆయన స్పందించారు.
NEET Paper Leak | కఠినంగా శిక్షించేందుకు చర్యలు ..
విద్యార్థుల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ప్రధాని మోదీస్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా త్వరితగతిన పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించామని ఆయన తెలిపారు. పేపర్ లీకేజీలకు పాల్పడటం అత్యంత తీవ్రమైన నేరమని పేర్కొంటూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
NEET Paper Leak | శిక్ష పడేలా చేస్తాం..
ఈ కేసులో నిందితులకు దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదుల ద్వారా కఠిన శిక్ష పడేలా చూస్తామని, భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి తప్పులకు పాల్పడకుండా ఈ తీర్పు ఒక ఉదాహరణగా నిలుస్తుందని మోదీపేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పరీక్షా పత్రాలు లీక్ కాకుండా పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం మనందరి జాతీయ బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
प्रधानमंत्री श्री @narendramodi, भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin एवं NDA के अन्य वरिष्ठ सभी नेताओं की उपस्थिति में नई दिल्ली में NDA संसदीय दल की बैठक और मंगल मिलन कार्यक्रम शुरू हो गया है। pic.twitter.com/tND7MSZNgO
— Dr.Mahendra Padalia (@DrPadaliabjp) July 21, 2026
ఇది కూడా చదవండి: Sikkim Tunnel Collapse | సిక్కింలో విషాదం.. సొరంగం కూలి 8 మంది కార్మికులు మృతి