అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Police | వర్షాల నేపథ్యంలో పోలీసుల సేవలు అభినందనీయమని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. మంగళవారం సీపీ కార్యాలయంలో ఆరో టౌన్ పోలీస్ సిబ్బందిని సన్మానించారు.
Nizamabad Police | బోధన్ రోడ్డుపై భారీగా నిలిచిన నీళ్లు..
నగరంలోని ఆరో టౌన్ పరిధిలోని బోధన్ రోడ్లో అల్ రెహమాన్ హోటల్ నుండి నిజాం ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వరకు వెళ్లే దారిలో భారీ వర్షం కారణంగా నీళ్లు నిలిచిపోయాయి. బోధన్ వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఆరో టౌన్ ఎస్సై సందీప్ ఆదేశాల మేరకు ఏఎస్సై జక్రయ్య, హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా హుటాహుటిన స్పందించారు. వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లారు.
డ్రైనేజీల్లో చెత్తాచెదారం నిండిపోయి రోడ్డుపై భారీ ఎత్తున నీళ్లు నిలిచిపోవడాన్ని గమనించిన పోలీసులు వెంటనే జేసీబీలు తెప్పించి చెత్తను తొలగింపజేశారు. పనులు పూర్యయ్యేవరకు అక్కడే ఉంచి పర్యవేక్షించారు. దీంతో వీరిద్దరిని సీపీ సాయిచైతన్య ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాశ్ యాదవ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఆరో టౌన్ ఎస్సై సందీప్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Rain Alert | సెల్ఫీల కోసం ప్రాణాలను తీసుకోవద్దు: ఎస్పీ రాజేష్ చంద్ర