అక్షరటుడే, డిచ్పల్లి: Paddy Crop Damage | వరిపంటకు నష్టం వాటిల్లేలా విషపూరిత రసాయనాలు పిచికారీ చేయడంతో పచ్చని పొలం కాస్త ఎండిపోయిది. ఈ ఘటన డిచ్పల్లి (Dichpally) మండలంలోని సాంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
Paddy Crop Damage | రసాయనాలు పిచికారీ..
డిచ్పల్లి మండలం సాంపల్లి గ్రామంలో రైతు సంగి గోపాల్కు చెందిన వరి పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత విషపూరిత రసాయనాలను పిచికారి చేశారు. దీంతో వరి పైరు తీవ్రంగా దెబ్బతిని ఎండిపోయింది. వరి పంటకు నష్టం జరిగిన విషయాన్ని గుర్తించిన బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై అరీఫ్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఘటనకు సంబంధించి అనుమానితులు ఎవరైనా ఉన్నారా అనే విషయమై రైతును అడిగి వివరాలు తెలుసుకున్నారు. దుండగులు అత్యంత విషపూరిత రసాయనాలు పిచికారీ చేయడంతోనే వరి పైరు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయినట్లు ఏఈవో జ్ఞానేశ్వర్ ప్రాథమికంగా నిర్ధారించారు.
ఇది కూడా చదవండి: ఇయర్ బడ్స్ అస్సలు సేఫ్ కాదు…