అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Surveillance System | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police) పరిధిలో పోలీసు నిఘా వ్యవస్థను పటిష్టపర్చాలని బాసర జోన్–2 డీఐజీ భాస్కరన్ (DIG Bhaskaran) పేర్కొన్నారు. శనివారం బోధన్(Bodhan)పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Police Surveillance System | రికార్డుల పరిశీలన
మొదటగా స్టేషన్లో సిబ్బందికి అందుబాటులో ఉన్న భద్రతా పరికరాలు, ఆయుధాల నిర్వహణ, రికార్డుల సంరక్షణ తదితర అంశాలను పరిశీలించి వాటి నిర్వహణపై అధికారులకు డీఐజీ సూచనలు చేశారు. అనంతరం రిసెప్షన్ సెంటర్ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఫిర్యాదుల నమోదు విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని గౌరవంతో స్వాగతించి, వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించే విధంగా సిబ్బంది వ్యవహరించాలని సూచించారు. స్టేషన్లో అమలవుతున్న ‘5 ఎస్ విధానం’ తీరును సమీక్షించారు. మహిళలు, వృద్ధులు, అత్యవసర సహాయం కోసం వచ్చే ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని స్పందించాలని తెలిపారు.
Police Surveillance System | సరిహద్దులో ఉన్నందున..
బోధన్ పోలీస్ స్టేషన్ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందున అన్ని ప్రధాన రహదారులపై నిఘా పటిష్టపరిచాలని ఆదేశించారు. ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాధించాలనే అత్యాశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ సైబర్ మోసగాళ్ళ చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతున్నారన్నారు. వాటిని నిలువరించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ ఎస్హెచ్వో వెంకటనారాయణ, బోధన్ ట్రాఫిక్ ఎస్సై మహేష్, బోధన్ టౌన్ ఎస్సై హబీబ్ ఖాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Morbi Well Water | అలల్లా కదలాడుతున్న నీరు..బావిని బిందెలా ఊపుతున్నారా..?