Pulse Polio | పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం: అదనపు కలెక్టర్ భుజంగరావు

ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మాణానికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ వి భుజంగరావు పిలుపునిచ్చారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Pulse Polio | ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు (Polio Vaccination) వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మాణానికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ వి భుజంగరావు(Additional Collector Bhujanga Rao) పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని దుబ్బ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

Pulse Polio | లక్ష్యాన్ని చేరుకోవాలి..

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్​ మాట్లాడుతూ.. జిల్లాలో (Nizamabad) నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రతిఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయాలన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. జిల్లాలో ఎంతమంది చిన్నారులు ఉన్నారు.. అవసరమైన డోసుల వాక్సిన్ అందుబాటులో ఉందా అని ప్రోగ్రామ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

44 2

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *