తెలంగాణRevanth Reddy | దేశ రాజకీయాల్లోకి వెళ్తా.. సీఎం రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

Revanth Reddy | దేశ రాజకీయాల్లోకి వెళ్తా.. సీఎం రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

తాను 2034 తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy | తాను దేశ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. 2034 వరకు సీఎంగా ఉంటానని, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పారు.

తన జీవితంలో ఇప్పటి వరకు తాను అనుకున్నట్లే జరిగిందని రేవంత్​రెడ్డి చెప్పారు. జెడ్పీటీసీ (ZPTC) నుంచి సీఎంగా ఎదిగిన తీరును వివరించారు. తాను జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా అవ్వాలని అనుకున్నానని, సాధించానని చెప్పారు. ఎంపీ అవ్వాలనుకున్నా 2014లో కుదర్లేదన్నారు. 2019లో అదే స్థానం నుంచి గెలిచానని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే సీఎం అవుతానని చెప్పానని, చెప్పినట్లుగానే అయ్యాయని పేర్కొన్నారు. 2034లో తెలంగాణలో కాంగ్రెస్‌ (Congress)ను గెలిపించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని పేర్కొన్నారు.

Revanth Reddy | బండి భగీరథ్​ను తీసుకు రావాలి

పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్​ (Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్​ పరారీలో ఉన్నాడని రేవంత్​రెడ్డి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి సెక్షన్లు పెట్టారని, వెంటనే నోటీసులు ఇవ్వగా అప్పటికే అతడు పరారీలో ఉన్నారని చెప్పారు. కొడుకు మీద కేసు అయితే బండి సంజయ్​ను అరెస్ట్ చేయాలా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి తక్షణమే తన కుమారుడిని విచారణకు తీసుకు రావాలని సూచించారు. కీలకమైన పదవిలో ఉన్న ఆయన హుందాగా వ్యవహరించాలన్నారు. కొడుకు తీరుతో బండి సంజయ్​కు తలవంపులు వచ్చాయని పేర్కొన్నారు.

Revanth Reddy | రాహుల్​ గాంధీ ప్రధాని అభ్యర్థి

కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ప్రధాని కావాలని లేదని రేవంత్​రెడ్డి అన్నారు. పార్టీని కేంద్రంలో అధికారంలోకి తేవాలని మాత్రమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన సమావేశంలో రాహుల్​ గాంధీకి ప్రధాని కావాలని గోల్​ ఉండాలని తానే ఒప్పించానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తమ ప్రధాని అభ్యర్థి అని పేర్కొన్నారు. తెలంగాణలో ఏదో కేస్ అయిందట చూడు అని రాహుల్ గాంధీ తనకు మెసేజ్ చేశారన్నారు. తెలంగాణలో జరిగే ప్రతి విషయంపై ఆయన ఫోకస్​ చేస్తారని, దానిని తనతో పంటుకుంటారన్నారు.

దీనిని కూడా చదవండి : Indiramma Houses | వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Nampally Railway Station | నాంపల్లి రైల్వే స్టేషన్​లో అగ్ని ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nampally Railway Station | హైదరాబాద్ (Hyderabad)​...

Supreme Court | సుప్రీంకోర్టు పొదుపు చర్యలు.. వారానికి రెండు రోజులు వర్చువల్ హియరింగ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | సుప్రీంకోర్టు పొదుపు చర్యలు...

Smita Sabharwal IAS | ప్రజల అధికారి ‘స్మితా సభర్వాల్’.. అంకితభావానికి నిలువెత్తు రూపం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Smita Sabharwal IAS | పాలనలో తనకంటూ ఒక ప్రత్యేక...