RTC Bus Accident | బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: RTC Bus Accident | వనపర్తి జిల్లా (Wanaparthy District) పెబ్బేరు సమీపంలో, ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన క్రమంలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

మంత్రాలయం నుంచి వనపర్తికి వెళ్తున్న బస్సు పెబ్బెరు సమీపంలో సోమవారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను పెబ్బేరు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.

RTC Bus Accident | వ్యాన్​ ఢీకొని మహిళ మృతి

విశాఖ నుండి తునివైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి ఐచర్​ వ్యాన్​ ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న మహిళ ఎగిరి వ్యాన్​పై పడింది. అనంతరం ఆ వ్యాన్​ మరో ట్రాలీని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన గాయత్రిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Ponnam Prabhakar on SIR | ఒక్క ఓటు కూడా పోవద్దు.. ఎస్​ఐఆర్​పై మంత్రి పొన్నం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *