Rythu Commission | రైతు కమిషన్​ పనితీరు భేష్​..: సీఎం రేవంత్​రెడ్డి

రైతు కమిషన్​ పనితీరుపై సీఎం రేవంత్​రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Rythu Commission | రైతు కమిషన్​ పనితీరుపై సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు కమిషన్​ బృందం సభ్యులు శనివారం హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Rythu Commission | ఇరిగేషన్​ నివేదిక సమర్పణ..

సీఎంను కలిసిన కమిషన్​ సభ్యులు సుమారు రెండు గంటల సేపు సమావేశమయ్యారు. తాము రూపొందించిన ఇరిగేషన్​ నివేదికను (irrigation report) రేవంత్​రెడ్డికి అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. రెండేళ్ల కాలంలో రైతు కమిషన్ చేసిన కార్యక్రమాలు, ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు, సూచనలను సీఎంకు వివరించారు. కమిషన్ పనితీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేస్తూ వారి పనితీరుకు కితాబునిచ్చారు. రైతాంగం కోసం ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ పథకాలు రైతులకు చేరేలా చూడాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డితో పాటు సభ్యులు కేవీఎన్ రెడ్డి, రాములు నాయక్, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి ఉన్నారు.

ఇది కూడా చదవండి: విద్యార్థిని దారుణంగా కొట్టిన టీచర్.. 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *