Snake Bite Death | ఎడపల్లిలో విషాదం.. పాముకాటుతో వ్యక్తి మృతి

ఎడపల్లి మండలం అంబెం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని పాము కాటు వేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్: Snake Bite Death | ఎడపల్లి (Yedapalli)లోని అంబెంలో విషాదం నెలకొంది. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని పాము కాటు వేయగా చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందాడు.

Snake Bite Death | మండలంలోని అంబెంలో ..

అంబెం గ్రామంలో సోమవారం తన ఇంట్లో గంగాకిషన్​ నిద్రించగా.. ఇంట్లోకి ప్రవేశించిన పాము అతడికి కాటు వేసింది. దీంతో వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు అతడిని బోధన్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వెంటనే నిజామాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ అతడు మంగళవారం మృతి చెందాడు. గంగాకిషన్​ మృతితో అంబెం గ్రామంలో విషాదం నెలకొంది.

ఇది కూడా చదవండి..: Nizam Sagar Flood | పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్ట్​.. నిజాంసాగర్​కు కొనసాగుతున్న వరద

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *