అక్షరటుడే, బాన్సువాడ: Srinagar Theft Cases | దొంగలు బీభత్సం సృష్టించారు. వర్ని(varni) మండలంలోని శ్రీనగర్ గ్రామంలో ఒకే రాత్రి తొమ్మిది ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు.
Srinagar Theft Cases | భయాందోళనలో ప్రజలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలంలోని శ్రీనగర్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పలు ఇళ్లల్లో చోరీలకు(House Burglaries) పాల్పడ్డారు. వరుసగా తొమ్మిది ఇళ్లలోకి చొరబడి అందినకాడికి దోచుకెళ్లారు. ఒకే రాత్రిలో ఇంత పెద్దఎత్తున దొంగతనాలు జరగడం స్థానికంగా సంచలనంగా మారింది. కొందరి ఇళ్లలో బీరువాలు, అల్మారాలు పగులగొట్టి నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువుల కోసం వెతికిన ఆనవాళ్లు కనిపించాయి. ఉదయం గమనించిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు.
Srinagar Theft Cases | పోలీసుల దర్యాప్తు
ఘటనపై సమాచారం అందుకున్న సీసీఎస్(CCS Police) ఏసీపీ మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ సురేష్, వర్ని ఎస్సై వంశీకృష్ణ రెడ్డి (varni police) వెంటనే గ్రామానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు ఎంత మేరకు నగదు, బంగారం అపహరించారనే విషయంపై పోలీసులు విచారణ(Police Investigation) కొనసాగిస్తున్నారు. ఒకేసారి తొమ్మిది ఇళ్లలో చోరీలు జరగడం ఇదే మొదటిసారి అని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఘటనతో శ్రీనగర్ గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో పోలీస్ పహారా పెంచాలని, రాత్రి సమయంలో గస్తీ నిర్వహించాలని కోరారు.
ఇది కూడా చదవండి: Siddipet Couple Suicide|సిద్దిపేటలో విషాదం.. పెళ్లైన నెలకే నవ దంపతుల ఆత్మహత్య

