Tirupati Aksharabhyasam | తిరుపతిలో అన్నప్రాసన, అక్షరాభ్యాసం

తిరుపతిలో అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలకు టీటీడీ శ్రీకారం చుట్టింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirupati Aksharabhyasam | తిరుపతిలో బాసర తరహా అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలకు టీటీడీ (TTD) శ్రీకారం చుట్టింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వకుళామాత ఆలయంలో ప్రవేశ పెట్టిన అక్షర గోవిందం-అన్నప్రాశనం కార్యక్రమాన్ని టీటీడీ ఛైర్మన్​ ప్రారంభించారు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసనం కోసం పలు ఆలయాలకు తీసుకు వెళ్తారు. నిర్మల్​ జిల్లా (Nirmal District)లో గల బాసర సరస్వతి మాత ఆలయంలో ఏటా లక్షలాది మంది పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో తిరుపతిలో కూడా అక్షరాభ్యాసం, అన్నప్రాశన కార్యక్రమాలు చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు వీటిని శుక్రవారం నుంచి ప్రారంభించింది. దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాశనం సైతం చేయించొచ్చు.

Tirupati Aksharabhyasam | గోవింద నామంతో..

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుమాట్లాడుతూ అక్షరాభ్యాసం, అన్నప్రాసనం ప్రతి చిన్నారి జీవితంలోని అత్యంత పవిత్ర సంస్కారాలు అన్నారు. తొలి అక్షరం గోవింద నామంతో మొదలైతే.. విద్యాభ్యాసం దైవానుగ్రహంతో విజయవంతంగా సాగుతుందనే విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అక్షర గోవిందం కిట్​ను ఉచితంగా పంపిణీ చేశారు. ఇందులో పలక, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, శ్రీవారి కంకణం, బెల్లం ఉంటాయి. వీటితో పాటు వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారు, సరస్వతీదేవి చిత్రపటాలు సైతం ఉంటాయని టీటీడీ ఛైర్మన్​ తెలిపారు.

Tirupati Aksharabhyasam | రోజుకు 50 మంది..

Tirupati Aksharabhyasam

అక్షర గోవిందం కార్యక్రమంలో 3 నుంచి 5 ఏళ్ల చిన్నారులు పాల్గొనవచ్చు. మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో వకుళమాత ఆలయంలో అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్షర గోవిందం కార్యక్రమంలో భాగంగా నిత్యం 50 మంది పిల్లలకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. బ్యాచ్​కు 25 మంది చిన్నారుల చొప్పున రెండు విడతల్లో అక్షరాభ్యాసం చేయిస్తారు. దీని కోసం భక్తులు గంట ముందుగానే వకుళామాత ఆలయానికి రావాలి. అనంతరం అక్కడ తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. చిన్నారుల తల్లిదండ్రులు సంప్రదాయ వస్త్రధారణలో హాజరు కావాలి.

ఇది కూడా చదవండి..: Prashanti Express Robbery | ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల హల్చల్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *