అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Varalakshmi Vratham | జిల్లావ్యాప్తంగా (Nizamabad) వరలక్ష్మీ వ్రతాలను సుహాసినులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి.
Varalakshmi Vratham |వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో..
నగరంలోని గంజ్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహించేందుకు సుహాసినులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సదర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మహిళలు పూజల్లో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. అలాగే మహిళలు తమ ఇళ్లల్లోనూ వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పూలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. నగరంలో రైల్వే కమాన్, రైల్వేస్టేషన్ వద్ద పూల దుకాణాలు, గంజ్లో పూజాసామగ్రి దుకాణాలు సందడిగా కనిపించాయి.
ఇది కూడా చదవండి: థియేటర్ లో హారతి ఇచ్చిన అభిమానులు