అక్షరటుడే, డిచ్పల్లి: Voter Enumeration Forms | ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేయాలని నిజామాబాద్ (Nizamabad) ఆర్డీవో రాజేంద్రకుమార్ సూచించారు. మండలంలోని మెంట్రాజ్పల్లిలో పోలింగ్ బూత్ల వారీగా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీని ఆర్డీవో పరిశీలించారు. తహశీల్దార్ సతీష్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Voter Enumeration Forms | ఓటర్లకు స్పష్టంగా వివరించాలి..

కుటుంబ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైనన్ని ఫారాలు ఇవ్వాలని, ఓటరు పేరు, ఇంటి నంబర్, మొబైల్ నంబర్ వంటి వివరాలను నిర్ధారించుకుని ఫారాలు అందజేయాలని ఆర్డీవో సూచించారు. ఫారం ఎలా నింపాలో ఓటరుకు స్పష్టంగా వివరించాలని, అవసరమైన ధ్రువపత్రాలు జత చేయాలని సిబ్బందికి ఆర్డీవో రాజేంద్రకుమార్ వివరించారు. ఇంట్లో ఎవరూ లేకపోతే పొరుగువారి ద్వారా సమాచారం ఇచ్చి, మళ్లీ వెళ్లి ఫారం అందజేయాలని, పంపిణీ చేసిన ప్రతి ఫారం వివరాలను నిర్దేశిత రిజిస్టర్/యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచి, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అవసరాలకే ఉపయోగించాలన్నారు. ఈ సూచనలు పాటించడం ద్వారా ‘సర్’ ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తవుతుందని పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బంది, బీఎల్వోలు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: 2K Run Awareness | ఉత్సాహంగా 2కే రన్.. పరుగు తీసిన విద్యార్థులు..