అక్షరటుడే, వెబ్డెస్క్: Weather Update | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.
వేడి తీవ్రతతో కూలర్లు, ఏసీల వినియోగం పెరిగింది. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా ఎండ తీవ్రత పెరగడం గమనార్హం. ఉదయం 9 గంటలకే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఈ క్రమంలో వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు చల్లని కబురు చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని పేర్కొన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Weather Update | ఈ జిల్లాల్లో..
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి-కొత్తగూడెంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. సిద్దిపేట, మెదక్, యాదాద్రి, జనగాం, వరంగల్, సంగారెడ్డి, రంగారెడ్డిలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ – రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. మే 6, 7 తేదీల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది.
ఇది కూడా చదవండి..: Illegal Mining | అక్రమ మైనింగ్పై హైడ్రా ఉక్కుపాదం

