అక్షరటుడే, వెబ్డెస్క్: Shamirpet Tahsildar Bribe | మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఏకంగా రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా ఓ తహశీల్దార్ను ఏసీబీ అధికారులు (ACB Officers) రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
హైదరాబాద్ నగర శివారులోని శామీర్పేట్ తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తహశీల్దార్ సుచరిత ఓ వ్యక్తి నుంచి రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో ఫైళ్లను పరిశీలిస్తున్నారు. కాగా తహశీల్దార్ డ్రైవర్ లంచం తీసుకొని ఆమెకు ఇస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. కార్యాలయ సిబ్బందిని సైతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Shamirpet Tahsildar Bribe | జోరుగా అవినీతి
రాష్ట్రంలోని తహశీల్దార్ కార్యాలయాల్లో అవినీతి జోరుగా సాగుతోంది. పలువురు అటెండర్ల నుంచి తహశీల్దార్ల వరకు లంచాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) నగర శివారులోని తహశీల్దార్ కార్యాలయాల్లో కాసుల వర్షం కురుస్తోంది. అక్కడ భూముల రేట్లు భారీగా ఉండటంతో ఏ పనికైనా అధికారులు భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తహశీల్దార్ సుచరిత రూ.20 లక్షలతో దొరకడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఓ సామాన్యుడు జీవితాంతం కష్టపడ్డ అంత డబ్బు సంపాదించలేడు. కానీ అవినీతి అధికారులు ఒక్కరోజులో అక్రమంగా అర్జిస్తున్నారు. అయినా ఇలాంటి వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం లేదు.
కాగా శామీర్పేట తహశీల్దార్ కార్యాలయం (Shamirpet Tahsildar Office)లో భారీగా అవినీతి జరుగుతున్నట్లు సమాచారం. గతంలో సైతం ఓ తహశీల్దార్ లంచం తీసుకుంటూ దొరికాడు. రెండేళ్ల క్రితం రూ.పది లక్షల లంచంతో శామీర్పేట తహశీల్దార్ పట్టుబడ్డాడు. తహశీల్దార్ ఆదేశాల మేరకు డబ్బు తీసుకుంటున్న డ్రైవర్ బద్రిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం తహశీల్దార్, డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి..: Working Women Safety | వర్కింగ్ ఉమెన్ భద్రత ప్రభుత్వ బాధ్యత : మంత్రి సీతక్క


