Manjeera Tragedy | ప్రాణం తీసిన ఈత  సరదా.. మంజీరలో మునిగి నలుగురు గల్లంతు

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Manjeera Tragedy | బాన్సువాడ ప్రాంతంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు మంజీర నదిలో గల్లంతయ్యారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన బాన్సువాడ మండలం బుడ్మి సమీపంలోని మంజీరా నదిలో (Manjeera River) చోటుచేసుకుంది.

Manjeera Tragedy | స్నానాలు చేసేందుకు దిగిన నలుగురు..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నలుగురు స్నేహితులు కలిసి సరదాగా మంజీర నదికి వెళ్లారు. నదిలో స్నానం చేస్తుండగా లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో ఒక్కసారిగా నీటి ప్రవాహంలో చిక్కుకుని గల్లంతైనట్లు సమాచారం. వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గంటల తరబడి సాగిన శోధన అనంతరం ముగ్గురు మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి (Banswada Area Hospital) తరలించారు. మరొకరి ఆచూకీ కోసం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. సంఘటనా స్థలంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. తమ పిల్లల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

manjeera 4

ఇది కూడా చదవండి: KA Paul Counter | పవన్​ కల్యాణ్​కు కేఏ పాల్ కౌంటర్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *