అక్షరటుడే, వెబ్డెస్క్ : Asifabad Forest Tension | మొక్కలు నాటడానికి వెళ్తున్న ఫారెస్ట్ అధికారులను రైతులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (Asifabad District)లో చోటు చేసుకుంది.
చింతలమానేపల్లి మండలంలో దిందాలో పోడు భూమి వివాదం నెలకొంది. రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చసుకుంది. భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు వెళ్లారు. వారిని స్థానికులు అడ్డుకున్ఆనరు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
Asifabad Forest Tension | పలువురి అరెస్ట్
అటవీ శాఖ అధికారుల వాహనాలకు అడ్డుగా పడుకుని స్థానికుల నిరసన తెలిపారు. దీంతో కొందరు స్థానికులను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోడు భూములను అటవీ శాఖ చదును చేస్తుండగా.. తమ సాగు భూములను నాశనం చేస్తున్నారని రైతుల ఆందోళన చేశారు. దీంతో గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోడు భూముల్లో ఉద్రిక్తత.. రైతులను అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు
పోడు భూములను అటవీ శాఖ చదును చేస్తుండగా అడ్డుకున్న రైతులు
తమ సాగు భూములను నాశనం చేస్తున్నారని రైతుల ఆందోళన
పోలీసులు, అటవీ శాఖ… pic.twitter.com/PF9ULzNMb2
— TNews Telugu (@TNewsTelugu) June 9, 2026
ఇది కూడా చదవండి..: Fish Prasadam Distribution | కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ