అక్షరటుడే, వెబ్డెస్క్: Kavitha Singareni Visit | తెలంగాణ రాజకీయాలు సింగరేణి చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల హరీశ్రావు (Harish Rao) సింగరేణిలో పర్యటించగా.. కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
సింగరేణిలో భారీగా అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత సైతం సింగరేణిలో పర్యటించనున్నారు.కవిత ఈనెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో ‘‘బాయిబాట’’ పేరుతో పర్యటిస్తారు. సింగరేణి అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద సింగరేణి కార్మికులతో సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటి విడత కార్యక్రమంలో భాగంగా ఆరు రోజుల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తారు.
Kavitha Singareni Visit | ఐదు నియోజకవర్గాల్లో..
టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) ఈ నెల 15న చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మందమర్రి ఏరియాలో పర్యటిస్తారు. 16న మంచిర్యాల నియోజకవర్గంలోని శ్రీరాంపూర్, 17న రామగుండం నియోజకవర్గంలోని ఆర్ జీ – 1 ఏరియా, 18న రామగుండం నియోజకవర్గంలోని ఆర్ జీ – 2 ఏరియాలో, 19న మంథని నియోజకవర్గంలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్, ఆర్ జీ – 3 ఏరియా, 20న భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి ఏరియా బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద కార్మికులతో సమావేశమవుతారు.
Kavitha Singareni Visit | సమస్యల పరిష్కారం కోసం..

సింగరేణి కార్మికుల కోసం కవిత పోరుబాట పడుతున్నారు. ఆమె గతంలో సైతం ఈ ప్రాంతంలో పర్యటించారు. కవిత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) కి గౌరవ అధ్యక్షురాలిగా పని చేశారు. కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. కొత్త పార్టీ పెట్టిన తర్వాత సైతం సింగరేణి కార్మికుల సమస్యలను లేవనెత్తారు. ఈ క్రమంలో తాజాగా ఆమె సింగరేణిలోని పలు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. కార్మికుల సమస్యలు తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.
ఇది కూడా చదవండి..: Meenakshi Natarajan Nomination | మీనాక్షి నటరాజన్ కేసు వివరాలు బయట పెట్టింది ఎవరు : బీఎల్ సంతోష్
