అక్షరటుడే, వెబ్డెస్క్ : Meenakshi Natarajan Nomination | రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఈసీ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP government)పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సంచలన ట్వీట్ చేశారు.
అంతటా గట్టిగా అరుస్తున్న @INCIndia బృందం, మీడియాలోని వారి అనుకూల వాదులు… ఆ పార్టీకి చెందిన వారిలో ఎవరు తెలంగాణ అంశాన్ని బహిరంగ చర్చలోకి తెచ్చారన్న ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారని బీఎల్ సంతోష్ అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందికర పరిస్థితులను నివారించడానికి ఆ లోపాన్ని సరిదిద్దుకోవడం మంచిదని ఆయన కాంగ్రెస్కు సూచించారు.
Meenakshi Natarajan Nomination | ఎవరు బయట పెట్టారు
తెలంగాణలో మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)పై కేసు నమోదు అయింది. ఈ విషయాన్ని ఆమె రాజ్యసభ నామినేషన్ అఫిడవిట్లో పేర్కొనలేదు. దీంతో బీజేపీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. కేసు వివరాలు దాచిపెట్టారని ఆరోపించారు. దీంతో రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ను తిరస్కరించారు. అయితే ఎన్నికల వేళ ఆమెపై నమోదు అయిన కేసు వివరాలు ఎవరు బయట పెట్టారని చర్చ సాగుతోంది. కాంగ్రెస్కు చెందిన నాయకులే ఇలా చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు.
Meenakshi Natarajan Nomination | సైబర్ క్రైంలో ఫిర్యాదు

మీనాక్షి నటరాజన్ కేసు వివరాలను సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) బయట పెట్టారని సోషల్ మీడియాలో కొందరు వ్యాప్తి చేస్తున్నారు. ఓ ఛానెల్లో ఈ వార్త ప్రచురితం కాగా కాంగ్రెస్ నాయకులు స్పందించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి కుట్ర ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు సైబర్ క్రైం పోలీసు (Cyber Crime Police)లకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రతిష్ట, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఓ ఛానెల్ వ్యవహరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Kavitha Law and Order | రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది: కవిత
