అక్షరటుడే, ఇందూరు: Quality Seeds Supply | రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గంగాధర్ పేర్కొన్నారు. నగరంలోని పలు ఎరువులు, విత్తన దుకాణాల్లో ఆయన వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు.
Quality Seeds Supply | పక్క రాష్ట్రాల నుంచి..
జిల్లాకు పక్క రాష్ట్రాల నుంచి విత్తనాలు సరఫరా జరుగుతున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. నిషేధిత గడ్డిమందులను విక్రయిస్తున్న కొందరు డీలర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని, అందుబాటులో ఉన్న రకాలను బోర్డుపై రాయాలని ఆదేశించారు. ఎవరైనా ఎరువుల కొరతను సృష్టించినా, అధిక ధరలకు యూరియా (Urea) అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు డీలర్ల వద్ద కొనుగోలు చేసే విత్తనాలు, ఎరువులకు సంబంధించిన రశీదులను విధిగా తీసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Bheemgal Ganja Seizure | ఎక్సైజ్ దాడుల్లో గంజాయి పట్టివేత.. ముగ్గురు బైండోవర్!
