అక్షరటుడే, డిచ్పల్లి : Dichpalli Police | కువైట్ (Kuwait)లో కనిపించకుండా పోయిన డిచ్పల్లి మండలం కోరట్పల్లి తండాకు చెందిన గుగ్లోత్ కైలాష్(30) ఇటీవల శవమై తేలినట్లు తెలియడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మార్చి నెలలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
కువైట్లోని సాల్మి ఎడారిలో కైలాష్ శవం పూడ్చి పెట్టడం తీవ్ర కలకలం రేపింది. హైవే పనుల నిమిత్తం మార్చి 19వ తేదీన వెళ్లిన యువకుడు కైలాష్ మరణించినట్లు కువైట్ దేశ పోలీసులు ప్రకటించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేపట్టిన కువైట్ పోలీసులు అక్కడే ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా… క్రేన్ ప్రమాదంలో కైలాష్ చనిపోయాడని, భయంతో తాను, తన తండ్రి కలిసి శవాన్ని అక్కడే పాతిపెట్టామని తెలిపాడు. నిందితుడిని డిచ్పల్లి మండలం సాంపల్లి తండా పంచాయతీ పరిధిలోని మేలయ తండాకు చెందిన కార్తీక్గా కువైట్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
Dichpalli Police | భారత్కు రావడంతో..
కార్తీక్ తన తండ్రి గణేశ్తో కలిసి మృతదేహాన్ని పూడ్చివేశాడు. అనంతరం గణేశ్ భారత్కు వచ్చాడు. దీంతో కైలాష్ కుటుంబ సభ్యులు డిచ్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. నిందితుడు దేశం విడిచి వెళ్లకుండా అలర్ట్ చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి కోరట్పల్లి తండాకు వెళ్లి మృతుడు కైలాష్ కుటుంబాన్ని పరామర్శించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని పట్టుకోవాలని సీఐ వినోద్, ఎస్సై అరీఫ్ను ఆదేశించారు.
Dichpalli Police | నిఘా పెట్టి..
కువైట్లో కైలాష్ శవాన్ని పూడ్చి పెట్టిన ఘటనలో కార్తీక్ తండ్రి బాదావత్ గణేష్ కదలికలపై నిఘా పెట్టిన డిచ్పల్లి పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కామారెడ్డిలో పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్సై అరీఫ్ తన సిబ్బందితో కామారెడ్డి పట్టణంలో తీవ్రంగా గాలించి ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గణేశ్ను డిచ్పల్లి ఠాణాకు కతీసుకు రాకుండా వేరే పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు సమాచారం. గణేశ్ను పోలీసులు ఎవరికి అప్పగిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే క్రైమ్ జరిగింది కువైట్ దేశంలో, ఇప్పటికే ఆ దేశంలో ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేశారు. మరో నిందితుడు గణేశ్ను పోలీసులు ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది.
దీనిని కూడా చదవండి : Mudragada Padmanabham | ముద్రగడ పద్మనాభం కన్నుమూత