అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad DRM | టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్ (Nizamabad RTC) డిప్యూటీ రీజినల్ మేనేజర్గా పి. జ్యోతి నియమితులయ్యారు. ఈ మేరకు కార్యాలయంలో బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.
Nizamabad DRM | మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి..
ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం డీఆర్ఎం జ్యోతి నిజామాబాద్ బస్స్టేషన్, డిపోలను (Bus Services) సందర్శించారు. అనంతరం ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, టికెటింగ్ విధానం, ప్రయాణిక్తుల రద్దీ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ఆయా బస్టాండ్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో అధికారులతో కలిసి ముందుకు వెళ్తామన్నారు.
