Bodhan Toddy Death | ఎక్సైజ్​ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన

బోధన్ మండలం నర్సాపూర్ గేట్ వద్ద కల్లు దుకాణంలో ఓ వ్యక్తి కల్లు తాగి మృతి చెందగా.. కుటుంబీకులు ఆందోళన చేపట్టారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్ : Bodhan Toddy Death | బోధన్ మండలం (Bodhan Mandal) నర్సాపూర్ గేట్ వద్ద కల్లు దుకాణంలో ఓ వ్యక్తి కల్లు తాగి మృతి చెందగా.. మరొకరు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన నియోజకవర్గంలో కలకలరం రేపింది.

Bodhan Toddy Death | బాధితుల నిరసన..

ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి కుటుంబీకులు శనివారం బోధన్​ పట్టణంలోని ఎక్సైజ్​ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కల్తీ కల్లు తాగడం వల్లే మృతి చెందాడని.. మృతిచెందిన వ్యక్తి సంబంధీకులు కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రావు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Police | నేరాల నియంత్రణకు ప్రజలే మా బలం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *