అక్షరటుడే, వెబ్డెస్క్: BRS Yuva Sangrama Sabha | బీఆర్ఎస్కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు అనుమతి ఇవ్వలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government)పై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. ఈ మేరకు ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్లపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఎన్నికల సమయంలో డిక్లరేషన్ల పేరిట హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తర్వాత వాటిని అమలు చేయడం లేదని గులాబీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి పెద్ద ఎత్తున సభలు నిర్వహించాలని ప్రణాళిక రచించారు. ఇప్పటికే వరంగల్ రైతు సభ పెట్టిన నాయకులు.. తాజాగా హైదరాబాద్లోని సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
BRS Yuva Sangrama Sabha | కోర్టుకు వెళ్తాం

నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తోంది. ఆ పార్టీ ముఖ్య నాయకులు దీనికి హాజరు కానున్నారు. పెద్ద ఎత్తున యువత, నిరుద్యోగులను తరలించడానికి బీఆర్ఎస్ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. రేపటి సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే దీనికి పోలీసులు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో సదస్సు నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు సుధీర్ రెడ్డి, శంభీపూర్ రాజు తెలిపారు. సభ అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని వారు పేర్కొన్నారు. కావాలనే అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సభ నిర్వహించి తీరుతామని నాయకులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Congress Meetings | తెలంగాణ కాంగ్రెస్లో కీలక మార్పులు.. మంత్రులతో మీనాక్షి నటరాజన్ భేటీ