అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Traffic Police Chase | ట్రాఫిక్ పోలీసులను (Traffic Police) చూసి బైక్పై వచ్చిన ఇద్దరు పరారయ్యారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ వెంబడించి ఇద్దరిలో ఒకరిని పట్టుకున్నారు. ఈ ఘటన నగరంలోని(Nizamabad) దేవిటాకీస్ రోడ్ చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద శనివారం చోటు చేసుకుంది.
Traffic Police Chase |తనిఖీల్లో భాగంగా..
నగరంలోని దేవి టాకీస్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పల్సర్ బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్ నరేష్ వారిని వెంబడించి ఒకరిని పట్టుకున్నాడు. అతడిని తనిఖీ చేయగా బంగారు గొలుసు లభ్యమైంది. బైక్ వివరాలు తనిఖీ చేయగా హైదరాబాద్ పాసింగ్ అని గుర్తించారు. అనంతరం అనుమానితుడిని ట్రాఫిక్ పోలీసులు వన్టౌన్ పోలీస్స్టేషన్లో అప్పగించారు. తనిఖీల్లో ఆర్ఐ వినోద్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: National Film Awards | జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు