Gambling Raid | పేకాట స్థావరంపై చీతా ఫోర్స్​ దాడి.. పలువురు అరెస్ట్

పేకాట స్థావరాలపై చీతా ఫోర్స్ వరుస దాడులకు పాల్పడుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Gambling Raid | పేకాట స్థావరాలపై చీతా ఫోర్స్ వరుస దాడులకు పాల్పడుతోంది. పక్కా సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుంటున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు.

Gambling Raid | నాల్గో టౌన్ పరిధిలో..

నగరం (Nizamabad)లోని 4వ టౌన్ పరిధిలోని మార్కండేయ గుడి వద్ద ఓ ఇంట్లో సోమవారం అర్ధరాత్రి పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు చీతాఫోర్స్​ దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సిబ్బంది రూ.47,350, ఏడు సెల్​ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని తదుపరి చర్యల నిమిత్తం నాలుగో టౌన్ ఎస్​హెచ్​వో సతీష్​కు అప్పజెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్టుగా సమాచారం తెలిస్తే డయల్​ 100కు, లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని వారిపై వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Bladder Stone Surgery | ఎల్లారెడ్డి ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స..యూరినరీ బ్లాడర్​ నుంచి 400 గ్రాముల రాయి తొలగింపు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *