అక్షరటుడే, వెబ్డెస్క్: CM Revanth Reddy | రాజకీయ కారణాలతోనే నా అమెరికా పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (MEA) అనుమతి నిరాకరించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం బోస్టన్కు వెళ్లకుండా.. కొన్ని గంటల్లోనే నేను తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతున్నానని వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ పెట్టారు.
CM Revanth Reddy | నాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు
అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో నాకు మద్దతునిచ్చిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ‘జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ విషయంలో నాకు అండగా నిలిచిన నా పార్టీకి, నాయకులకు మరియు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ నేను ఎంతో కృతజ్ఞుడను. లండన్లో నా సమావేశాలు మరియు నిర్ణీత కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. మూడు రోజులుగా నాకు లభించిన అద్భుతమైన మద్దతుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’ అని రాసుకొచ్చారు.
CM Revanth Reddy | అన్ని విషయాల గురించి మాట్లాడతా..
‘నా అమెరికా పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో తిరిగి హైదరాబాద్కు వస్తున్నాను. హైదరాబాద్కు చేరుకున్న తర్వాత ఈ అంశాలకు సంబంధించిన అన్ని విషయాల గురించి మాట్లాడతాను.’ అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
My deepest gratitude for the strong support from our leader and Congress party national president, Shri Mallikarjun Kharge ji @kharge on the issue of Centre denying me permission to travel to the USA.
I am very thankful to my party, all the leaders and people across the country…
— Revanth Reddy (@revanth_anumula) August 23, 2026
ఇది కూడా చదవండి..: Autos Bandh | ఆటోల బంద్.. మంత్రి పొన్నం కీలక ప్రకటన..