అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Exhibition | నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో (Polytechnic Ground) ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మూసివేశారు. రెండురోజుల క్రితం క్రేజీ వీల్ విరిగిన (crazy wheel accident) ఘటనలో పలువురికి గాయాలైన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం నుమాయిష్ (Numaish) ను మూసివేయడం గమనార్హం.
Nizamabad Exhibition | వరుస సంఘటనలతో..
ఈ సీజన్లో నుమాయిష్లో వరుస సంఘటనలు సందర్శకులను భయభ్రాంతులకు గురిచేశాయి. కొన్నిరోజుల క్రితం ఎగ్జిబిషన్లోనే ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందగా.. తాజాగా సోమవారం ఇద్దరు వ్యక్తులు క్రేజీ వీల్ విరిగిపోవడంతో గాయపడ్డారు.
ప్రస్తుతం పరికరాలను మరమ్మతులు జరుగుతున్న దృష్ట్యా మంగళవారం మూసివేస్తున్నట్లుగా నిర్వాహకులు నోటీసు బోర్డుపై రాసుకొచ్చారు. ఈ మేరకు 3వ టౌన్ ఎస్సై హరిబాబు (Nizamabd Police) ను సంప్రదించగా.. ఎగ్జిబిషన్లో విరిగిన క్రేజీ వీల్ మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు ఒకరోజు నిర్వాహకులు నుమాయిష్ను మూసివేసినట్లు తెలిపినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి:Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. నీటి సరఫరాలో అంతరాయం


