తెలంగాణLand Pattas | అర్హులందరికీ భూ పట్టాలు అందిస్తాం: మంత్రి పొంగులేటి

Land Pattas | అర్హులందరికీ భూ పట్టాలు అందిస్తాం: మంత్రి పొంగులేటి

అర్హులందరికీ భూ పట్టాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో మాట్లాడారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Pattas | ధరణి కష్టాలు తొలగించి, అర్హులందరికీ భూ పట్టాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti) అన్నారు. ఖమ్మం (Khammam) జిల్లా సత్తుపల్లి మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాలు, ధరణి పోర్టల్‌లోని లోపాల వల్ల పేదలు, రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి అన్నారు. దీంతో తాము అధికారంలోకి వచ్చాక రైతులకు చుట్టం లాంటి భూ భారతి (Bhu Bharati) పోర్టల్​ తీసుకొచ్చామని తెలిపారు. నాడు గడీల పెత్తనంలో బందీ అయిన భూ రికార్డులను విడిపించి, భూములపై పేదలకే సర్వాధికారాలు కల్పించే దిశగా ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంతేగాకుండా జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరును ప్రారంభిస్తామని తెలిపారు.

Land Pattas | భూ సమస్యలు పరిష్కరిస్తాం

సత్తుపల్లి పట్టణ పరిధిలోని 399 సర్వే నంబర్ అంశంతో పాటు, చుట్టుపక్కల 9 గ్రామాల్లో ఉన్న దాదాపు 6,500 ఎకరాల భూ సమస్యల ను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. పేదపల్లి, నారాయణపురం పరిసరాల్లోని 5,500 ఎకరాల పైచిలుకు భూములను సర్వే చేసి, కబ్జాలో ఉన్న అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని, పహానీలలో వారి పేర్లు ఎక్కించాలని ఆదేశించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు పొందిన రైతులు బోర్లు వేసుకుంటుంటే అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు పెట్టవద్దని సూచించారు.

దీనిని కూడా చదవండి : Telangana Minimum Wages | కార్మికులకు సీఎం గుడ్​న్యూస్​.. కనీస వేతనాలు పెంపు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana Railway Projects| అశ్విని వైష్ణవ్‌తో కిషన్ రెడ్డి భేటీ.. రైల్వే పనులపై ప్రత్యేక సమీక్ష

అక్షరటుడే వెబ్‌డెస్క్:Telangana Railway Projects|తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల కల్పన, కొత్త...

Yellareddy Development | అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారు..

అక్షరటుడే, లింగంపేట: Yellareddy Development | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని చూసి...

Rupee Fall | రూపాయి పతనం ఆగేనా? బ్రహ్మాస్త్రం రెడీ చేస్తోన్న కేంద్ర బ్యాంక్!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rupee Fall | అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి...

Stock Market Losses | నష్టాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Losses | దేశీయ స్టాక్ మార్కెట్...