అక్షరటుడే, ఇందూరు: Aadhaar Cards | ఒక విద్యార్థికి రెండు ఆధార్ కార్డులు ఇవ్వడంతో ఆ విద్యార్థి చదువు ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. ఈ ఘటన నగరంలోని(Nizamabad ) ఆధార్ సెంటర్లో (Aadhaar Card) చోటుచేసుకుంది.
Aadhaar Cards | రాజీవ్ గాంధీ ఆడిటోరియం వద్ద..
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మాక్లూర్ మండలం గంగరమంద గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కొడుకు ఆధార్ కార్డు అప్డేట్ నిమిత్తం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలోని ఆధార్ సెంటర్కు వచ్చాడు. అయితే ఆధార్ సెంటర్లోని నిర్వాహకులు పాత ఆధార్ కార్డును చూసి ఇది ఆన్లైన్లో కనిపించడం లేదని కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలని పేర్కొన్నారు. నివాస ధృవపత్రం తీసుకొస్తే కొత్త ఆధార్ కార్డు తీద్దామని పేర్కొనడంతో బాధితుడు నివాస ధృవపత్రంతో ఆధార్ కేంద్రాన్ని సంప్రదించాడు. వారు నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థి పేరిట మరో కొత్త ఆధార్ కార్డు తీశారు. అయితే కొత్త ఆధార్ కార్డుతో పాఠశాలకు వెళ్లిన విద్యార్థి తండ్రికి చుక్కెదురైంది. ఆన్లైన్లో సదరు విద్యార్థికి సంబంధించిన ఆధార్ వివరాలు కనిపించకపోవడంతో పాఠశాల నిర్వాహకులు మళ్లీ మొదటి నుంచి చదువుకోవాలని సూచించారని బాధితుడు తెలిపాడు. నాలుగేళ్ల చదువును పక్కకు పెట్టి మళ్లీ మొదటి నుంచి చదవాలని చెప్పడంతో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో తిరగి నగరంలోని ఆధార్ సెంటర్ను ఆశ్రయించాడు.
ఇది కూడా చదవండి: పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు : పీసీసీ చీఫ్