అక్షరటుడే, వెబ్డెస్క్ : Bandi Bhagirath Case | కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసు (POCSO Case)లో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తాజాగా భగీరథ్కు నోటీసులు జారీ చేశారు.
బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని బండి భగీరథ్పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అయితే బండి భగీరథ్ పరారీలో ఉండటంతో అతడి కోసం గాలిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని తాజాగా నోటీసుల్లో పేర్కొన్నారు.
Bandi Bhagirath Case | కోర్టుకు వెళ్లిన భగీరథ్
ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని భగీరథ్ హైకోర్టు (High Court)లో పిటిషన్ వేశారు. ప్రస్తుతం కోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్ను విచారించనుంది. ఈ నెల 14న వెకేషన్ బెంచ్ దీనిపై విచారణ చేపడుతోంది. 13న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు అయితే అతడిని అదుపులోకి తీసుకుంటారని సమాచారం. అయితే భగీరథ్ విచారణకు హాజరు అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Bandi Bhagirath Case | పోలీసులకు అప్పగించాలి
బండి సంజయ్ POCSO కేసులో బాధితులను బెదిరించలేదని తడిబట్టలతో హనుమాన్ గుడిలో ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ‘నిజమైన హనుమాన్ భక్తుడివైతే నీ కొడుకును పోలీసులకు అప్పగించు’ అని ఆయన అన్నారు.
దీనిని కూడా చదవండి : Indiramma Houses | రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు అప్పుడే.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

