అక్షరటుడే, వెబ్డెస్క్: Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు హన్మకొండలో విద్యార్థులతో కలిసి ఆమె ర్యాలీలో పాల్గొన్నారు.
ఫీజు బకాయిల కోసం హన్మకొండ (Hanmakonda) అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి కవిత ర్యాలీగా వచ్చారు. కలెక్టరేట్ గేట్ వద్ద పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అంతమందిని లోపలికి అనుమతించమని చెప్పారు. దీంతో కలెక్టరేట్ గేట్ ఎదుట విద్యార్థులతో కలిసి ఆమె బైఠాయించారు. విద్యార్థులందరినీ కలెక్టరేట్ లోపలికి అనుమతించాలని కోరారు. ఆమె నిరసనతో పోలీసులు విద్యార్థులను, కవితను లోనికి అనుమతించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ చాహత్ బాజ్పాయ్కు వినతి పత్రం అందించారు. ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Fee Reimbursement | పోరాటం కొనసాగుతుంది
కవిత మాట్లాడుతూ.. రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉండటం వల్ల, డిగ్రీలు పూర్తి చేసుకున్న ఎంతోమంది విద్యార్థులు సర్టిఫికెట్లు అందుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితంతో చెలగాటం ఆడకుండా వెంటనే స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Singareni Alias Issue | సింగరేణి మారుపేర్ల వివాదంపై భట్టి కీలక ప్రకటన