అక్షరటుడే, మెండోరా : Giant Fish Catch | జిల్లాలో మృగశిర కార్తె సందడి నెలకొంది. ఈ సందర్భంగా పండుగ రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో చేపలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
Giant Fish Catch | మెండోరా మండలంలో..
మండలంలో మృగశిల కార్తె (మిరుగు) సందర్భంగా చేపలకు గిరాకీ పెరిగింది. ఈ క్రమంలో గోదావరి (Godavari)లో ఆదివారం గంగపుత్రులకు భారీ చేప చిక్కింది. సుమారు 14 కేజీల బొచ్చ చేప దొరికింది. దీంతో గంగపుత్రులు సంతోషం వ్యక్తం చేశారు. రూ. 300 కిలో చొప్పున ఈ చేపను విక్రయించారు. తాము నీటి వనరులమీదే బతుకుతున్నామని.. నీళ్లున్నప్పుడే తాము జీవనోపాధి పొందుతున్నామని.. వర్షాలు లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడు ఉమేష్, కార్యదర్శి లక్కంపల్లి రాజేందర్ పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : CCTV Surveillance | సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ: సీపీ సాయిచైతన్య
