Indiramma Towers | హైదరాబాద్​లో ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్​డేట్​

హైదరాబాద్​లో ఇందిరమ్మ ఇళ్ల దక్కించుకున్న లబ్ధిదారులకు సోమవారం నుంచి మంజూరు పత్రాలు అందించనున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Indiramma Towers | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్​ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసింది. వారికి సోమవారం మంజూరు పత్రాలు అందజేయనున్నారు.

తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) సోమవారం నుంచి ‘ఇందిరమ్మ హౌసెస్ టవర్స్’ ప్రాజెక్టుకు సంబంధించిన కేటాయింపు లేఖలను పంపించనుంది. లబ్ధిదారులకు ఈ లేఖలు వారి నమోదిత మొబైల్ నంబర్లకు ఎస్​ఎంఎస్, వాట్సాప్ ద్వారా అందుతాయి. అలాగే ఇవి టీజీహెచ్​బీ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపరాఉ.

Indiramma Towers | ప్రారంభించనున్న మంత్రి

శేరిలింగంపల్లిలోని రాయదుర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) మంజూరు పత్రాల పంపిణీని సోమవారం ప్రారంభించనున్నారు. మల్కం చెరువు వెనుక ఉన్న 2.85 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ టవర్స్​ నిర్మించనున్నారు. దీనికి సైతం మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ఒక్కొక్కటి సుమారు 528 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 480 ఫ్లాట్లు ఉంటాయి.

ఇది కూడా చదవండి : The Paradise ticket prices | ది ప్యారడైజ్​ సినిమా.. తెలంగాణలో టికెట్​ ధరల పెంపు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *