అక్షరటుడే, వెబ్డెస్క్: KTR on Revanth | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి కాపీ కొట్టి పరీక్షల్లో పాస్ అయ్యారన్నారు. గోడలకు సున్నాలు వేసుకునే ఆయనకే అంత ఉంటే.. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎంత ఉండాలన్నారు.
సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అన్నారు. వారు సొంతంగా జాబ్కు అప్లై చేయలేరని, స్కిల్స్ ఉండటం లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సొంతంగా ఎలక్షన్ అఫిడవిట్ నింపగలరా అని ప్రశ్నించారు. ఆయన సొంతంగా నింపితే ఏ ఛాలెంజ్కైనా తాను సిద్ధమని ప్రకటించారు.
KTR on Revanth | కాంగ్రెస్కు సమాధి కడుతారు
రేవంత్ రెడ్డి జీవితంలో ఒక పోటీ పరీక్ష అయినా రాశాడా? ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడా అని కేటీఆర్ ప్రశ్నించారు. నకల్ కొట్టి పాస్ అయి, గోడల మీద సున్నం వేసుకొని బతికిన వ్యక్తి రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు, ఫ్లై ఓవర్లు, భవనాలు తెలంగాణ ఇంజినీర్లు కట్టారన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇంజినీరింగ్ విద్యార్థులు సమాధి కడుతారని హెచ్చరించారు.
KTR on Revanth | రాహుల్ గాంధీ ఎక్కడ..
గ్రూప్స్ నోటిఫికేషన్ రావడం లేదని ఇటీవల ఖమ్మం జిల్లాలో ఓ నిరుద్యోగి వేణు కుమార్ ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ.. వేణు కుమార్ రాసింది సూసైడ్ నోట్ కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఛార్జ్ షీట్ అన్నారు. హైదరాబాద్ వచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ ఈరోజు పిల్లలు ఆత్మహత్యాయత్నం చేసుకుంటుంటే ఎందుకు స్పందించడం లేదన్నారు.
ముఖ్యమంత్రి నిరుద్యోగులను ఎండ్రిన్ తాగండి, చావండి అంటుంటే రాహుల్ గాంధీ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం క్రిమినల్ వేస్ట్ అన్నారు.
ఇది కూడా చదవండి..: Unemployed Protest | 19 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలి.. నిరుద్యోగుల ధర్నా