అక్షరటుడే వెబ్డెస్క్: Palamuru Irrigation Projects | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఆయన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవులపల్లి పరిధిలో పర్యటించారు. అక్కడ శరవేగంగా సాగుతున్న మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు.
Palamuru Irrigation Projects | ఉన్నతాధికారులతో సుదీర్ఘ చర్చ..
ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తదితరులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతిపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించి, పనులను వేగవంతం చేయాలని పలు కీలక సూచనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల ఫొటో గ్యాలరీని ముఖ్యమంత్రి, మంత్రుల బృందం ఆసక్తిగా తిలకించింది.

Palamuru Irrigation Projects | రెండు రోజుల పాటు పర్యటన..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన గురు, శుక్రవారాల్లో కొనసాగనుంది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన పాలమూరు-రంగారెడ్డి, మక్తల్-నారాయణపేట-కొడంగల్, కల్వకుర్తి ఎత్తిపోతల, జూరాల, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, పంపుహౌస్లు, కాలువలు, డెలివరీ సిస్టర్న్ల నిర్మాణ పనులను ఆయన స్వయంగా తనిఖీ చేయనున్నారు. అనంతరం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.

Palamuru Irrigation Projects | భారీ బహిరంగ సభ..
జిల్లాలో పాత ప్రాజెక్టుల పరిస్థితి, ప్రస్తుతం నడుస్తున్న పనుల పురోగతి, అలాగే భవిష్యత్తులో చేపట్టబోయే సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో అవగాహన తెచ్చుకోనున్నారు. గురువారం మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రారంభమైన ఈ పర్యటన.. శుక్రవారం జడ్చర్లలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభతో ముగియనుంది.
ఇది కూడా చదవండి: Kamareddy Rain | కామారెడ్డిలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు
