అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam Project Water | ఎల్లారెడ్డి (Yellareddy), నాగిరెడ్డిపేట మండలాల్లో వానాకాలం పంటల సాగు కోసం పోచారం ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు. ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
Pocharam Project Water | పొంగిపొర్లుతున్న పోచారం..
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండి పొంగిపొర్లుతోంది. దీంతో దిగువన ఉన్న చెరువులు, కుంటలు నింపేందుకు అధికారులు స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం గేట్లను ఎత్తి 150 క్యూసెక్కుల నీటిని పోచారం ప్రధాన కాలువలోకి విడుదల చేశారు.
అధికారుల లెక్కల ప్రకారం.. విడుదల చేసిన నీరు 15 రోజుల పాటు చివరి ఆయకట్టు వరకు అందుతుంది. ఆ తర్వాత 10 రోజుల పాటు నీటి విడుదల నిలిపివేయనున్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ రజిత వెంకట్రామిరెడ్డి, రామచంద్ర రెడ్డి, వాసు, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Pocharam Project Water | జలాశయం నిండడంతో ప్రత్యేక పూజలు

ఈ ఖరీఫ్ సీజన్లో కురిసిన వర్షాలకు పోచారం జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతో మాజీ జడ్పీటీసీ సభ్యుడు మనోహర్ రెడ్డి గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూలై 9న జలాశయం పూర్తిస్థాయిలో నిండాలని కోరుతూ అమ్మవారికి కొబ్బరికాయలు మొక్కుకున్నానని తెలిపారు. నెల రోజుల్లోనే జలాశయం నిండడంతో బీఆర్ఎస్ నాయకులతో కలిసి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నామని, ప్రత్యేక పూజలు నిర్వహించామని చెప్పారు. గత 20 ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Bhu Bharati Applications | భూభారతి, సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి