Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Raghunandan Rao | రేవంత్ రెడ్డికి అవే లాస్ట్ ఎలక్షన్స్.. కూనంనేని సీటు కూడా మేమే గెలుస్తాం: రఘునందన్

Shivam nagarani
Last updated: June 3, 2026, 7:28 pm 7:28 pm
Shivam nagarani
Share
Raghunandan Rao

అక్షరటుడే వెబ్‌డెస్క్: Raghunandan Rao | తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవే చివరి ఎన్నికలు అవుతాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ( Raghunandan Rao )సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Raghunandan Rao | బీజేపీని టార్గెట్ చేస్తున్నారు..

సొంత పార్టీని కాపాడుకోలేక చేతులెత్తేసిన బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే బీజేపీని టార్గెట్ చేస్తున్నారని రఘునందన్ రావు విమర్శించారు. చిట్‌చాట్‌ల పేరుతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ బీజేపీపై లేనిపోని అపవాదులు వేయడం బాధాకరమన్నారు. ‘జై తెలంగాణ’ నినాదాన్ని వాడుకుంటూ ఇతర పార్టీలపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. గతంలో ఆంధ్ర ప్రజల గురించి బీఆర్ఎస్ ఎన్నో రకాలుగా మాట్లాడిందని గుర్తు చేసిన ఆయన.. ప్రజల సొమ్మును దోచుకుంటున్నారనే కోపంతోనే జనం బీఆర్ఎస్‌ను ఓడించి ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు.
ragunandhan.1

 

Raghunandan Rao | కూనంనేని సవాల్ స్వీకరిస్తున్నాం..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విసిరిన ఛాలెంజ్‌పై రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. “తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి గెలిచే దమ్ము సీపీఐకి ఉందా?” అని ఆయన ప్రశ్నించారు. కమ్యూనిస్టులను ప్రజలు ఎప్పుడో పక్కనబెట్టేశారని, సొంతంగా నిలబడే సత్తా ఆ పార్టీలకు లేదని విమర్శించారు. కూనంనేని సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని.. రాబోయే ఎన్నికల్లో ఖమ్మంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, చివరికి కూనంనేని ప్రాతినిధ్యం వహిస్తున్న సీటును కూడా బీజేపీనే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల బలమే తమ శక్తి అని, ‘అంత్యోదయ’నే తమ సిద్ధాంతమని స్పష్టం చేశారు.

ragunandhan.2

Raghunandan Rao | కాంగ్రెస్ అవినీతిపై పోరాటం..

దేశంలోని అన్ని రాష్ట్రాలను ప్రధాని నరేంద్ర మోడీ సమానంగా చూస్తున్నారని రఘునందన్ రావు కొనియాడారు. కాంగ్రెస్‌కు, బీజేపీకి అస్సలు పొంతన లేదని.. కాంగ్రెస్ తూర్పు అయితే బీజేపీ పడమర లాంటిదని పేర్కొంటూ.. ‘కాంగ్రెస్ ముక్త భారత్’ కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, వారు చేసిన తప్పులకు ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌లోనే బీజేపీ జెండా పాతామని, అలాంటిది తెలంగాణలో బీజేపీ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి పోలింగ్ బూత్‌లో ఒంటరిగానే గెలిచేందుకు తమ శ్రేణులు కృషి చేస్తున్నాయని రఘునందన్ రావు తెలిపారు.

ఇది కూడా చదవండి: Harishrao Birthday | ఆర్​కే ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఘనంగా హరీశ్​రావు జన్మదిన వేడుకలు

TAGGED:BJP TelanganaBRS partyCongress Telanganalatest newspolitical newsRaghunandan RaoRevanth Reddytelangana bjpTelangana Politicstelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article SI Transfers SI Transfers | కమిషనరేట్​లో భారీగా ఎస్సైల బదిలీలు
Next Article ACB Raids Bhujangarao ACB Raids Bhujangarao | భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తుల గుర్తింపు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

cm revanth 3
తెలంగాణ

Panchayat Staff Salaries | పంచాయతీ సిబ్బందికి తీపి కబురు.. ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని సీఎం ఆదేశం

By Naresh Chandan
Bandi Bhageerath POCSO
తెలంగాణ

Bandi Bhageerath POCSO | బండి భగీరథ్​ ఎక్కడ ఉన్నాడో సీఎంకు తెలుసు : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

By Srinivas Kolluri
Weather Update
తెలంగాణ

Weather Update | వాతావరణ శాఖ చల్లని కబురు.. తెలంగాణకు వర్ష సూచన

By Srinivas Kolluri
Kaleshwaram Project Probe
తెలంగాణ

Kaleshwaram Project Probe : కాళేశ్వరం అవినీతిపై విచారణకు సీఎం కీలక నిర్ణయం.. సీబీఐకి లేఖ!

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.