అక్షరటుడే, వెబ్డెస్క్ : Revanth Reddy Convoy | సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లోని వాహనాలను తగ్గించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కాన్వాయ్లో 9 వాహనాలు ఉండగా 4 నుంచి 5 వాహనాలకు కుదించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలని ప్రధాని మోదీ (PM Modi) ప్రజలను కోరిన విషయం తెలిసిందే. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు స్వయంగా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సైతం వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు భద్రతా వ్యవహారాలను చూసే పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Revanth Reddy Convoy | మంత్రుల కాన్వాయ్లో సైతం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంధనం ఆదా చేయాలని ప్రధాని ప్రజలను కోరారు. విద్యుత్ వాహనాలను, ప్రజారవాణాను వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు కాన్వాయ్లో వాహనాల సంఖ్య తగ్గించుకుంటున్నారు. తెలంగాణ (Telangana)లో సైతం మంత్రుల కాన్వాయ్లో సైతం వాహనాలు తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎన్ని వాహనాలను తగ్గించాలనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఇది కూడా చదవండి..: Rabi Paddy Procurement | ముమ్మరంగా వరి కొనుగోళ్లు.. 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ.. రైతుల ఖాతాల్లో రూ.4,520 కోట్లు జమ!

