అక్షరటుడే, వెబ్డెస్క్: RS Praveen Kumar | రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో కేసులో నిందితుడు ఆరుగురిని హత్య చేసిన విషయం తెలిసిందే. బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
శంకర్పల్లి వద్ద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. స్టేషన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హోం మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
RS Praveen Kumar | నిందితుడిని అరెస్ట్ చేయాలి

ప్రభుత్వం తమను అరెస్ట్ చేయకుండా నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఆరుగురిని పాశవికంగా హత్య చేసిన నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడన్నారు. సభలతో ప్రజాధనం వృథా చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి హోంశాఖపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజ్కుమార్ ఆరుగురిని చంపి పరారు అయ్యాడన్నారు. నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడన్నారు. గతంలో బండి భగీరథ్ను సైతం పోలీసులు పోక్సో కేసులో అరెస్ట్ చేయలేకపోయారని విమర్శించారు. రేవంత్రెడ్డి హోంశాఖ మంత్రిగా విఫలం అయ్యారని విమర్శించారు. పేదలకు రక్షణ లేదు తాము గొడవ చేయడానికి వెళ్లడం లేదని, బాధితులను పరామర్శించడానికి వెళ్తే అరెస్ట్ చేయడం సరికాదన్నారు. రాజ్కుమార్ పోక్సో కేసులో బెయిల్ తెచ్చుకొని, చంపుతా అని చెప్పి హత్య చేశాడన్నారు. నిందితుడిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. పోలీసులు సీఎం రేవంత్రెడ్డి, ఆయన సోదరులను రక్షించడంలో బిజీగా ఉన్నారన్నారు. పేదల ప్రాణాలకు తెలంగాణలో రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: Rangareddy Murders | ఘోరం.. కక్షతో ఆరుగురి దారుణ హత్య.. బాధితులు పొక్సో కేసు కుటుంబం!