అక్షరటుడే, ఇందూరు: Munnuru Kapu Merit Awards | తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఇందూరు) నిజామాబాద్ (Nizamabad) ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. ఈ మేరకు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తోట రాజశేఖర్, రవీందర్ అబ్బాపూర్ ప్రకటన విడుదల చేశారు.
Munnuru Kapu Merit Awards | ఈనెల 7వ తేదీన..
అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఎస్సెస్సీ, ఇంటర్, ఈపీసెట్, జేఈఈ అడ్వాన్స్లలో ప్రతిభ చూపిన మున్నూరుకాపు సంఘం విద్యార్థులకు పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కల్యాణ మండపంలో ఈనెల 7న ఆదివారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి మున్నూరుకాపు రాష్ట్ర ఛైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి పటేల్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని వివరించారు.

అలాగే జిల్లా మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) విశిష్ట అతిథిగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని.. వారితో పాటు క్రీడారంగంలోనూ ప్రతిభ చూపిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. ఈ ఏడాది 2025-26లో క్రీడల్లో జాతీయస్థాయిలో ప్రతిభ చాటిన వారు తమ వివరాలను వెంటనే జిల్లా కమిటీకి అందజేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికీ పేరు నమోదు చేసుకున్న విద్యార్థులు కార్యక్రమానికి తమ తల్లిదండ్రులతో విచ్చేసి సత్కారాన్ని అందుకోవాల్సిందిగా వారు కోరారు.
ఇది కూడా చదవండి..: Power Substation | ఎత్తొండ క్యాంప్లో 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం
