అక్షరటుడే, వెబ్డెస్క్ : Executive Engineer Bribery | ఒడిశా రాయగడ్లోని రూరల్ వర్క్స్ డివిజన్-I (RWD-I) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసన్న కుమార్ పట్నాయక్ లంచం తీసుకుంటూ దొరికాడు. రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఒడిశా విజిలెన్స్ అధికారులు మంగళవారం రాత్రి ఆయనను అరెస్టు చేశారు.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసన్న కుమార్ ఒక కాంట్రాక్టర్ నుండి రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. రూ. 50 లక్షల విలువైన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి, కొత్త టెండర్ ప్రక్రియలో పాల్గొనడానికి అవసరమైన పని అనుభవ ధృవీకరణ పత్రాన్ని (work experience certificate) జారీ చేయడానికి ఈ లంచం అడిగాడు. బిల్లు మొత్తం రూ.50 లక్షలు కాగా.. అందులో 5 శాతం (రూ.2.5 లక్షలు) లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అనంతరం దానిని రూ.రెండు లక్షలకు తగ్గించాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు.
Executive Engineer Bribery | ఇంట్లో సోదాలు
విజిలెన్స్ అధికారులు మంగళవారం రాత్రి పట్నాయక్ లంచం తీసుకుంటుండగా రెడ్-హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఆయన నివాసాలు, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రాయగడలోని ఆయన ప్రభుత్వ నివాస గృహం నుండి అదనంగా రూ. 3.39 లక్షల నగదును విజిలెన్స్ అధికారులు గుర్తించారు. పట్నాయక్ జూన్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. వారం రోజుల్లో రిటైర్ అవుతున్నా సదరు అధికారి లంచం తీసుకోవడం గమనార్హం.
దీనిని కూడా చదవండి : Mumbai Heavy Rains | ముంబైని ముంచెత్తిన వర్షాలు