అక్షరటుడే వెబ్డెస్క్: Rythu Bharosa Funds | తెలంగాణలోని ( Telangana ) రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మకమైన ‘రైతు భరోసా’ పథకం ద్వారా పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిధుల విడుదల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం నాలుగో రోజుకు చేరుకుంది. చిన్న, సన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, విడతల వారీగా నిధులను విడుదల చేస్తున్నారు. మొదటి రోజు ఒకటి, రెండు ఎకరాలున్న వారికి ప్రారంభించిన ఈ ప్రక్రియ, తాజాగా 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ వర్తింపజేశారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకే (DBT) నగదు జమ అవుతుండటంతో, తమకు డబ్బులు అందినట్లు రైతుల మొబైల్స్కు సమాచారం అందుతోంది.
Rythu Bharosa Funds | హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు..
వ్యవసాయ సీజన్ మొదలైన కీలక సమయంలో, ప్రభుత్వం సకాలంలో పెట్టుబడి సాయం అందించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఈ నిధులు ఎంతో ఆసరాగా ఉంటాయని చెబుతున్నారు. దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా, నేరుగా తమ అకౌంట్లలోకి నగదు రావడంపై ప్రభుత్వంపై కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Rythu Bharosa Funds | త్వరలో అందరికీ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ఇచ్చిన మాట ప్రకారం పంపిణీ చేస్తున్నామని అధికార వర్గాలు వెల్లడించాయి. పెండింగ్లో ఉన్న మిగిలిన రైతులకు కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిధులు జమ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Scanning Centre Fraud | స్కానింగ్ సెంటర్లో రూ.లక్షలు కాజేసిన ఉద్యోగులు.. ఒకరి అరెస్ట్