అక్షరటుడే, వెబ్డెస్క్ : Rythu Bharosa Scheme | ఖమ్మం జిల్లాలో శుక్రవారం రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం రేవంత్రెడ్డి హాజరై రైతు భరోసా నిధులను విడుదల చేస్తారు.
వానాకాలం సీజన్లో రైతు భరోసా నిధుల విడుదలను సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) జూన్ 30న ప్రారంభించారు. ఖమ్మంలో సభ పెట్టి నిధులు విడుదల చేయాలని భావించారు. ఇందుకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఆ సమయంలో వర్షాలతో సభను పెట్టలేదు. దీంతో సీఎం హైదరాబాద్ నగరంలోని శిల్పకళా వేదికలో నిధుల విడుదలను ప్రారంభించారు. తొలి రోజు రెండు ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా జమ చేశారు.
Rythu Bharosa Scheme | రూ. 9 వేల కోట్లు

ఈ సీజన్లో అందరి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని సీఎం తెలిపారు. రూ.9 వేల కోట్లను విడుదల చేస్తామన్నారు. ఈ మేరకు గురువారం వరకు నిధులు విడుదల చేశారు. శుక్రవారం చివరి విడుత రూ.1,009 కోట్లను సీఎం విడుదల చేయనున్నారు. దీంతో అందరి రైతుల ఖాతాల్లో డబ్బుల జమ అవుతాయయని ప్రభుత్వం తెలిపింది. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు జమ చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతు భరోసా విజయవంతంగా జమ చేయడంతో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురంలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇది కూడా చదవండి..: RTC Bus Theft | మద్యం మత్తులో.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు