అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Transgender Protest |నగరంలోని కలెక్టరేట్ ఎదుట ట్రాన్స్జెండర్లు ధర్నాకు దిగారు. తమను గ్రామాల్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజావాణి (Prajavani)లో అధికారులకు ఫిర్యాదు చేశారు.
Transgender Protest | వీడీసీల నిర్ణయంపై ఆగ్రహం
ట్రాన్స్జెండర్స్ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఓరుగంటి గంగ, జరీనా బేగం మాట్లాడుతూ.. గ్రామాల్లోకి ట్రాన్స్జెండర్లు వీడీసీలు ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల సిరికొండ మండలం (Sirikonda Mandal) మైలారం గ్రామంలో చిన్న పిల్లల్ని అపహరిస్తున్నారంటూ భౌతికదారులకు దిగారన్నారు. అలాగే నందిపేట మండలం హుస్నాపూర్లో హిజ్రాలను జీపీలో అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. మోపాల్ మండలం (Mopal Mandal)లో హిజ్రాలు రావొద్దంటూ పోస్టర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు.
Transgender Protest | ఎంతవరకు న్యాయం..
తమను పూర్తిగా సామాజిక బహిష్కరణ చేయడం ఎంతవరకు సబబని ట్రాన్స్జెండర్లు ప్రశ్నించారు. ఎక్కడైనా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరిగితే వెళ్లి వారిని ఆశీర్వదించి ఇచ్చినంత తీసుకొని వస్తామని.. అలాంటి తమపై దుష్ప్రచారం చేయడం సరైనది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు గ్రామాభివృద్ధి కమిటీలు ఎస్సీ, ఎస్టీ బీసీలను బహిష్కరణ చేస్తే నేడు హిజ్రాలను సైతం బహిష్కరణ చేయడం పూర్తిగా చట్ట విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ట్రాన్స్జెండర్లపై భౌతికదాడులను నిరోధించాలని మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వీడీసీలపై చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్ల సంక్షేమ సంఘం సభ్యులు వంకాయల అక్షర, ఆర్తి, శ్యామల, ఆసది, అలక, ప్రియ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: GPO Assistants | జీపీవోలకు అసిస్టెంట్లను నియమించాలి..

