అక్షరటుడే, వెబ్డెస్క్: Bandi Sanjay Anger | సిరిసిల్ల ఎస్పీ మహేష్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనకు ఎస్పీ గైర్హాజరు కావడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు.
బండి సంజయ్ శనివారం సిరిసిల్ల (Sircilla)లో పర్యటించారు. సోమవారం నుంచి పాఠశాలలు పున : ప్రారంభం కానున్న నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య పాఠశాలలో ‘‘మన బడి – మన బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బండి సంజయ్ పాఠశాలలో బెంచీలను కడిగారు.
Bandi Sanjay Anger | బీఆర్ఎస్లో చేరమని చెప్పండి
కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన సందర్భంగా స్వాగతం పలకడానికి ఎస్పీ మహేశ్ (SP Mahesh) హాజరు కాలేదు. బదులుగా వేరే అధికారి వచ్చి ఆయనకు మొక్క అందించారు. దీంతో సంజయ్ ఎస్పీ తీరుపై ఆయనతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఎస్పీకి బీజేపీ కార్యకర్తలంటే కోపమెందుకు అన్నారు. కేటీఆర్పై అంత ప్రేమ ఎందుకన్నారు. బీఆర్ఎస్పై అంత ప్రేమ ఉంటే ఆ పార్టీలోనే చేరమని చెప్పండని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Orange Alert | భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
