అక్షరటుడే, కామారెడ్డి: Drunken Driving Cases | మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదని జిల్లా పోలీసులు హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా(Kamareddy Police) నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 86 మందిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం శిక్షలు విధించింది.
Drunken Driving Cases | ముగ్గురికి జైలుశిక్ష..
ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమే కాకుండా సొంత ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టే చర్య అన్నారు. ఈ కేసుల్లో ముగ్గురికి న్యాయస్థానం ఒక రోజు జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి మొత్తం రూ.1,30,800 జరిమానా విధించిందన్నారు. క్షణిక నిర్లక్ష్యం జీవితాంతం బాధకు కారణమవుతుందని, ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజల ప్రాణాల రక్షణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, జిల్లావ్యాప్తంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్ నుంచి.. ఫస్ట్ ఎలిమినేషన్ అతడేనా..!