Revanth Reddy Leadership | రేవంత్ రెడ్డే తెలంగాణకు సరైన నాయకుడు : ధర్మపురి సంజయ్​

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Revanth Reddy Leadership | రాష్ట్రానికి రేవంత్​రెడ్డి (CM Revanth reddy) సరైన నాయకుడని మాజీ మేయర్​, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay)​ పేర్కొన్నారు. ఈ మేరకు Nizamabad నగరంలోని ప్రగతినగర్​ మున్నూరుకాపు సంఘంలో విలేకరులతో మాట్లాడారు.

Revanth Reddy Leadership | రాష్ట్రాన్ని బీఆర్​ఎస్​ అప్పుల పాలు చేసింది..

రాష్ట్రాన్ని బీఆర్​ఎస్ (BRS)​ అప్పుల పాలు చేసిందని.. అలాంటి బీఆర్​ఎస్​ నాయకులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని సంజయ్​ పేర్కొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్​దేనన్నారు.

ఇటు సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, అటు బీఆర్​ఎస్​ చేసిన అప్పులు తీరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ, అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తుందని.. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే అభివృద్ధి ఆలస్యం ఆవుతుందని గుర్తుచేశారు. ఎప్పటికైనా సబ్బండ వర్గాలకు కాంగ్రెస్​తోనే న్యాయం జరుగుతుందన్నారు.

Revanth Reddy Leadership | ఎలాంటి పదవి లేకున్నా పనిచేస్తున్నా…

రాష్ట్రాన్ని, జిల్లాను ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని, రేవంత్ రెడ్డి హయాంలోనే అది సాధ్యం అవుతుందన్నారు. ఆయనను మించిన నాయకుడు లేడన్నారు.

సీఎం తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం సెలవు తీసుకోకుండా అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. నిజామాబాద్​లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్​పై ఉందన్నారు.

ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కావొస్తుందని, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారన్నారు. కష్టపడి పని చేసిన వారికి పదవులు వస్తాయని, ఇలాంటి పదవులు లేకున్నా తాను ప్రజల కోసం పనిచేస్తున్నానన్నారు.

sanjay

ఇది కూడా చదవండి: 2036లో భారతదేశం ఒలంపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *