అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ganesh Mandap Registration | గణేష్ మండపాల వివరాలు పోలీస్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) పేర్కొన్నారు. హైదరాబాద్(Hyderabad) నుంచి రాష్ట్రంలోని జిల్లాల సీపీలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
Ganesh Mandap Registration | మండపాల వివరాలు సేకరించాలి..
వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే మండపాల నిర్వాహకులు తమ మండపాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీస్ పోర్టల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీజీపీ సూచించారు. మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, నిర్వాహకుల పేర్లు, వారి సంప్రదింపు నంబర్లు, విగ్రహానికి సంబంధించిన వివరాలు తదితర పూర్తి సమాచారాన్ని పోలీస్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. దీనివల్ల ప్రతి మండపానికి సంబంధించిన సమాచారం పోలీస్ శాఖ వద్ద అందుబాటులో ఉండాలన్నారు అవసరమైన సమయంలో సమన్వయం చేసుకోవడానికి , భద్రతా చర్యలు చేపట్టడానికి వీలవుతుందని పేర్కొన్నారు.
Ganesh Mandap Registration | నిబంధనలు పాటించాలి..
మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ సూచించే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేయకుండా సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ వైర్లు, తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు, జనరేటర్లు తదితర వాటి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. మండపాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలని , మహిళలు , పిల్లలు , వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, ఏఆర్ ఏసీపీ శ్రీరాములు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, మల్లేశం, రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) ధరణి కుమార్, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Heavy Rain Alert | రైతులకు గుడ్న్యూస్.. 13 నుంచి భారీ వర్షాలు